IAS officer narahari transferd to central service from madhya pradesh :
మధ్య ప్రదేశ్, ఏప్రిల్ 13:
తెలంగాణకు చెందిన బిసి బిడ్డ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హవా నడిపిస్తున్నాడు. 2001వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన పరికిపండ్ల నరహరి, మొన్నటి వరకు మధ్యప్రదేశ్ లో చాలా కాలం పని చేశారు. తాజాగా అయన పని తనాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీసులో భూ వనరుల (Land Resource) శాఖలో ఐదేళ్ల కాలానికి జాయింట్ సెక్రటరీగా నియమించింది. మధ్య ప్రదేశ్ లో టూరిజం శాఖా కార్యదర్శిగా పని చేసినంత కాలం అక్కడి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఎంతో తపన పడ్డారు. తెలుగు సినిమా రంగం నుంచి మధ్యప్రదేశ్ లో షూటింగ్ చెయ్యడానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి ఎంతో సహాయపడ్డారు. అక్కడి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించింది. మధ్య ప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందటానికి ఏ ఏ ఎస్ అధికారి నరహరి ఎంతో కీలకపాత్ర పోషించారని చెప్పవచ్చు. అందుకే ఆయన సేవలను గుర్తించిన కేంద్రం కేంద్ర సర్వీసులో సేవలు ఉపయోగించుకోనుంది.


