Chennai’s First Match Ends in Defeat – Disappointment for MS Dhoni Fans:
ఐపీఎల్ తాజా సీజన్ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. సోమవారం రాత్రి జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తొలి పోటీలో చెన్నై ఘోర పరాజయాన్ని చవి చూసింది. రాజస్థాన్ అవలీలగా చెన్నై పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణిత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చెయ్యగలిగింది.

తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ చెన్నైను ఉతికి ఆరేసింది. రాజస్థాన్ నుంచి ఓపెనర్ గా దిగిన వైభవ్ సూర్యవంశీ 52 పరుగులు చేశారు. సిక్స్ లతో స్టేడియంలో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం పన్నెండు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులతో విజయకేతనం ఎగురవేశారు. కాలికి గాయాల వల్ల ధోని ఈ మ్యాచ్ ఆడలేకపోయారు. దీంతో ధోని ఫాన్స్ నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు.


