Anil Ravipudi’s Multi-Starrer Movie to Begin Soon”విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొలాబరేషన్ లో విజయవంతమైన నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ ఇటీవల ఒక భారీ సినిమాటిక్ కొలాబరేషన్ ను ప్రకటించింది. వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి ఘనంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు. ఈ బ్యానర్ ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ రీజినల్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి వరుస విజయాలను అందించింది.
సురేష్ ప్రొడక్షన్స్, అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జీ స్టూడియో సహ-నిర్మాతగా చేరింది. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నం వంటి బ్లాక్బస్టర్ ఎంటర్టైనర్ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం.
ఇటివలే ఎం ఎస్ జీలో అతిధి పాత్రలో అదరగొట్టారు వెంకటేష్. అలాగే సంచలనాత్మక బ్లాక్బస్టర్ పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్తో ఇది అనిల్ రావిపూడి రెండవ చిత్రం. ఈ కొత్త చిత్రం, దర్శకుడు అనిల్ రావిపూడితో షైన్ స్క్రీన్స్ సంస్థకు మూడో కొలాబరేషన్ నిలుస్తూ, వీరి విజయవంతమైన అనుబంధం మరింత బలపడింది.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ను అనిల్ రవిపూడి అంచనాలకు తగ్గట్టుగా రూపొందిస్తున్నారు.
త్వరలో పూజా కార్యక్రమంతో సినిమాను ప్రారంభించి, ఆ తర్వాత టైటిల్తో పాటు ఇతర వివరాలను వెల్లడించనున్నారు.


